హైదరాబాద్ : ఉపాధ్యాయ, ఉద్యోగులకు పీఆర్సీని 30 శాతంగా ప్రకటించడంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో అనేక సేవలందించే అంగన్ వాడీలకు కూడా మరోసారి వేతనాలు పెంచి సీఎం కేసీఆర్ అంగన్ వాడీల కుటుంబ పెద్దగా నిలిచారన స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మేరకు మంత్రి మహిళా శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖలోని 24వేల మంది అంగన్ వాడీల కుటుంబాలు ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల లబ్ధి పొందుతాయన్నారు. వారంతా సంతోషంగా ఉంటారని, వారి పక్షాన కృతజ్ఞతలన్నారు. కస్పూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవును ప్రకటించి ఈ ప్రభుత్వంలో మహిళలకు రాజకీయాల్లోనే కాదు అన్ని రంగాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మరోసారి చాటిచెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.