ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం సలార్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. సలార్ అంటే కమాండర్ ఇన్ చీఫ్ అని అర్థం చెప్పాడు దర్శకుడు. తన సినిమాలో గ్రూపులో కుడిభుజంలా ఉన్న వ్యక్తి లీడర్ ఎలా అయ్యాడు అనేది చిత్రంలో ఆసక్తిగా చూపించనున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ను ఎవ్వరూ చూపించని స్థాయిలో.. అంత పవర్ ఫుల్గా ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.
సలార్ చిత్రం ఉగ్రంకు రీమేక్ అని కొందరు అంటుంటే మరి కొందరు స్ట్రైట్ మూవీ అని చెప్పుకొచ్చారు. అయితే సలార్ చిత్రాన్ని యష్ కోసం రాసుకున్నాడట ప్రశాంత్ నీల్.కేజీఎఫ్ చిత్రానికి ముందు ఈ కథను యష్కు వినిపించగా, పలు కారణాల వలన ఆయన తిరస్కరించాడట. ఇప్పుడు ఆ కథలో కొన్ని మార్పులు చేసి ప్రభాస్తో సలార్ అనే మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో కథానాయికగా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. సలార్లో బాలీవుడ్ నటులు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు.