అనంతపురం: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న విషయం ప్రతిపక్షనేత చంద్రబాబుకు తెలియదా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే చంద్రబాబు మాత్రం దౌర్జన్యాలు జరిగాయంటున్నారని మండిపడ్డారు. అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల విమర్శించారు.
టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు హైడ్రామా సృష్టించారని విమర్శించారు. టీడీపీ నేతలను బెదిరించాల్సిన అవసరం మాకు లేదన్నారు. చంద్రబాబు తన పార్టీ పరిస్థితిపై ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎస్ఈసీ అనుమతి లేకుండా తిరుపతికి వచ్చిన చంద్రబాబు నానాయాగీ చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.