హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఏఐటీఏ మహిళల టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయిదేదీప్య సత్తాచాటింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సాయిదేదీప్య, అనూష కొండవీటి జోడీ 6-4, 6-2తో నిఖిత, యషిక ద్వయంపై అలవోక విజయం సాధించింది.
ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన సాయిదేదీప్య, అనూష జంట వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది.