హరిద్వార్: ఇవాళ సోమావతి అమావాస్య. హరిద్వార్లోని గంగా నదిలో సాధువులు పుణ్య స్నానాలు ఆచరించారు. హరి కి పౌరి ఘాట్లో నిరంజనీ అఖారాకు చెందిన సాధువులు రెండవసారి షాహీ స్నాన్ చేశారు. హరిద్వార్లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో సాధువులు నదిలోకి దిగి పుణ్య స్నానాలు చేశారు. శివభక్తిలో మునిగితేలారు.