హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ వేడుకల్లో పాల్గొన్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలను సాయంత్రం సమయంలో ఇంటి ఎదుట పెట్టి.. కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ.. ఉత్సాహంగా ఆటలాడారు. అనంతరం సద్దుల వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు.