రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో డీఆర్జీ జవాన్ సలిఖ్రామ్ మృతి చెందారు. ఇర్పనార్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుండగా.. ఎదురు కాల్పుల ఘటనను బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ ధ్రువీకరించారు. నారాయణపూర్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంఓల ఉన్న బర్పూర్ మార్గ్లోని కడమెటా – కడేనార్ మధ్య మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న డీఆర్జీ, ఐటీబీపీ సిబ్బంది కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో ఇర్పనార్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలపై మావోలు భద్రతా సిబ్బందిపై మెరుపుదాడి చేశారు. వెంటనే భద్రతా బలగాలు సైతం తేరుకొని ధీటైన సమాధానం ఇచ్చాయి. మావోల కాల్పుల్లో తీవ్రంగా గాయపడడంతో డీఆర్జీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందారు. భానుప్రతాప్పూర్లో నివాసం ఉంటున్న జవాన్ సలిఖ్రామ్ డీఆర్జీలో ఏఎస్ఐగా నియామకమయ్యారు. ఆయన మృతదేహాన్ని దంతెవాడ మీదుగా అటవీ మార్గంలో మార్గంలో నారాయణపూర్కు తరలించనున్నారు.