ముంబై: మాస్టర్ బ్లాస్టర్, మేటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్.. ఈ ఏడాది ముంబై రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. మహారాష్ట్ర, ఢిల్లీతో జరిగే మ్యాచ్లకు సంబంధించిన ముంబై జట్టును ప్రకటించారు. అయితే అర్జున్ టెండూల్కర్ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో సెలెక్టర్ సలిల్ అంకోలా తెలిపారు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న తర్వాత.. అర్జున్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, ముంబై క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతన్ని జట్టుకు ఎంపిక చేసినట్లు సెలెక్టర్ అంకోలా తెలిపాడు. ముంబై టీ20 జట్టుకు గతంలో ప్రాతినిధ్యం వహించిన అర్జున్.. ఇప్పటి వరకు ఆ జట్టు తరపున రంజీ ట్రోఫీలో ఆడలేదు. గత ఏడాది కోవిడ్ వల్ల రంజీ టోర్నీని నిర్వహించలేదు. పృధ్వీ షా నేతృత్వంలోని ముంబై జట్టు.. కోల్కతా వేదికగా.. జనవరి 13వ తేదీ నుంచి మహారాష్ట్రతో రంజీ మ్యాచ్ ఆడనున్నది.