ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ 2012 లో సరిగ్గా ఇదే రోజున తన 100 వ అంతర్జీతీయ సెంచరీ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో సాధ్యం కాని చారిత్రాత్మక మైలురాయిని భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేరుకున్నారు. మీర్పూర్ షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన వందో సెంచరీ సాధించారు. బంగ్లాదేశ్తో జరిగిన ఇన్నింగ్స్లో సచిన్ 147 బంతుల్లో 114 పరుగులు చేసి.. 290 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచారు. అయితే, దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. నాలుగు బంతులు మిగిలిఉండగానే బంగ్లాదేశ్ విజయం తన ఖాతాలో వేసుకున్నది.
100 వ అంతర్జాతీయ సెంచరీ సాధించడం ‘లిటిల్ మాస్టర్’కు అంత సులభమేం కాలేదు. ఎందుకంటే అతను ఈ మైలురాయిని చేరుకోవడానికి దాదాపు ఒక ఏడాది పాటు వేచి ఉండాల్సి వచ్చింది. 2011 మార్చిలో దక్షిణాఫ్రికాపై 99 వ సెంచరీ చేసిన సచిన్.. 90 పరుగుల వద్ద రెండుసార్లు అవుట్ అయ్యాడు. అరుదైన మైలురాయిని సాధించిన తరువాత.. ఈ దశలో తాను ఏమీ ఆలోచించలేనని చెప్పారు. ఈ మ్యాచ్ జరిగిన రెండు రోజుల తర్వాత తన కెరీర్లో చివరి వన్డే ఆడారు. మార్చి 18 న ఆడిన మ్యాచ్ సచిన్ వన్డే కెరీర్లో 463 వది అలాగే, చివరి మ్యాచ్. మైలురాయిని సాధించి 8 సంవత్సరాల తరువాత కూడా టెండూల్కర్ రికార్డు అలాగే పదిలంగా ఉన్నది. కాగా, ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ 71 సెంచరీలతో రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 70 సెంచరీలు సాధించాడు.
1980 నుంచి ఇరాక్-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. వేలాది మంది మరణించారు. అయితే, 1988 మార్చి 16 న జరిగిన దాడి చరిత్రలో అత్యంత క్రూరమైన సంఘటనలలో ఒకటిగా నిలిచిపోయింది. ఉదయం 11 గంటల సమయంలో ఇరాక్ సరిహద్దులో ఉన్న హల్బాజా అనే నగరంపై ఇరాక్ సైన్యం రసాయన దాడికి పాల్పడింది. ఆవపిండిని గాలిలో కరిగించడంతో కనురెప్ప మూసి తెరిచేలోగా 5,000 మందికి పైగా మరణించారు. 10,000 మందికి పైగా వివిధ వ్యాధులకు గురయ్యారు. హెల్బాజా నగరం ఇరాక్-ఇరాన్ సరిహద్దులో ఉన్నది. ఇరాక్లో సద్దాం హుస్సేన్ పాలన పట్ల అసంతృప్తితో చాలా మంది కుర్దిష్ ప్రజలు ఇక్కడ నివసించారు. ఇరాన్ సైన్యం ఈ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు, వారిని స్థానిక కుర్దులు స్వాగతించారు. ఈ విషయం నియంత సద్దాంకు వ్యతిరేకంగా జరిగింది. కుర్దులకు గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకున్న సద్దాం హుస్సేన్ ఈ దాడికి పాల్పడినట్లుగా చరిత్ర చెప్తున్నది.
2014: క్రిమియాలోని ఉక్రెయిన్ నుండి వేరుచేసి రష్యాతో కొనసాగేందుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహణ
2014 : భారతదేశం వ్యాప్తంగా పొలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం
2007: ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ హెర్షెల్ గిబ్స్
1968: వియత్నాం యుద్ధంలో వందలాది మంది అమాయకులను చంపిన అమెరికన్ బలగాలు
1945: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ నేవీ ఇయో జిమాను స్వాధీనం చేసుకున్న అమెరికా నౌకాదళం
1945: రెండవ ప్రపంచ యుద్ధంలో వెర్బర్గ్ నగరంపై వైమానిక దాడి చేసిన బ్రిటన్
1926: ప్రపంచంలో మొట్టమొదటి ద్రవ ఇంధన రాకెట్ ప్రయోగం
1910: క్రికెటర్ ఇఫ్తీఖర్ అలీఖాన్ పటౌడి జననం
1799: ప్రముఖ ఫొటోగ్రాఫర్ అనా అట్కిన్స్ జననం
1751: అమెరికా నాలుగో అధ్యక్షుడు జేమ్స్ మాడిసన్ వర్జీనియాలో జననం
సద్దాం హుస్సేన్ ఈ దాడికి పాల్పడినట్లుగా చరిత్ర చెప్తున్నది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు:
2014: క్రిమియాలోని ఉక్రెయిన్ నుండి వేరుచేసి రష్యాతో కొనసాగేందుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహణ
2014 : భారతదేశం వ్యాప్తంగా పొలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం
2007: ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ హెర్షెల్ గిబ్స్
1968: వియత్నాం యుద్ధంలో వందలాది మంది అమాయకులను చంపిన అమెరికన్ బలగాలు
1945: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ నేవీ ఇయో జిమాను స్వాధీనం చేసుకున్న అమెరికా నౌకాదళం
1945: రెండవ ప్రపంచ యుద్ధంలో వెర్బర్గ్ నగరంపై వైమానిక దాడి చేసిన బ్రిటన్
1926: ప్రపంచంలో మొట్టమొదటి ద్రవ ఇంధన రాకెట్ ప్రయోగం
1910: క్రికెటర్ ఇఫ్తీఖర్ అలీఖాన్ పటౌడి జననం
1799: ప్రముఖ ఫొటోగ్రాఫర్ అనా అట్కిన్స్ జననం
1751: అమెరికా నాలుగో అధ్యక్షుడు జేమ్స్ మాడిసన్ వర్జీనియాలో జననం