కీవ్ : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. సెంట్రల్ ఉక్రెయిన్లో డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో రష్యా జరిపిన దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం స్థానిక గవర్నర్ వాలెంటిన్ రెజ్నిచెంకో తెలిపారు. ఈ భయంకరమైన రాత్రి. దాడుల్లో 11 మంది మరణించారు’ అని టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత మరికొద్ది సేపటికే మరో ఇద్దరు మృతి చెందారంటూ తెలిపారు. మరో వైపు జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ నుంచి డ్నీపర్ నదికి అవతలి వైపున మార్గానెట్స్లో జరిగిన దాడుల్లో 12 మంది మృతి చెందారని ప్రాంతీయ కౌల్సిల్ హెడ్ మైకోలా లుకాషుక్ పేర్కొన్నారు.
దాడుల్లో అడ్మినిస్ట్రేటివ్ భవనాలు దెబ్బతిన్నాయని, పాఠశాల, సాంస్కృతిక భవనం, నగర మండలి భవనం దెబ్బతిన్నాయని తెలిపారు. పట్టణంలో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని, కేవల మందికి కరెంటు సదుపాయం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని అమెరికా ప్రకటించింది. రాకెట్లు, మందుండు సామగ్రి, ఇతర ఆయుధాలను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ నేరుగా ఉక్రెయిన్ సాయుధ దళాలకు పంపిణీ చేస్తున్నది.