హైదరాబాద్ : త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్కు వివిధ సంఘాల నుంచి మద్దతుల వెల్లువ కొనసాగుతున్నది. తాజాగా
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్, ఎస్ఎల్టీఏ సంఘాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు రెండు సంఘాల ప్రతినిధులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను కలిసి మద్దతు లేఖను అందించాయి.
భాషా పండితుల కోసం జీవో. 2, జీవో. 3 విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్కు ఆయ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి తిరుమల క్రాంతికృష్ణ, ఎస్ఎల్టీఏ అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్ ప్రతినిధులు పాల్గొన్నారు.