హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రూపాయి పతనం కొత్త రికార్డులు సృ ష్టిస్తున్నది. పాతాళాన్ని వెదుకుతూ పరుగులు పెడుతున్నది. మంగళవారం భారత రూపాయి అమెరికా డాలర్తో రూ.81.58కి దిగజారిం ది. గత ఏడాది ఇదే రోజు డాలర్కు రూ.73 ఉన్నది. కరెన్సీ విలువ అంతకంతకూ దిగజారుతుండటంతో దిగుమతులపై పెను భారం పడుతున్నది. ముఖ్యంగా భారీగా దిగుమతులపైనే ఆధారపడిన ఫార్మా పరిశ్రమ కుదేలవుతున్నది. భారత ఫార్మా పరిశ్రమకు రాజధానిగా, ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా వెలుగొందుతు న్న హైదరాబాద్లో కూడా ఫార్మా కంపెనీలు రూపాయి పతనంతో తల్లడిల్లుతున్నాయి. మనదేశంలో ఔషధాల తయారీకి అవసరమైన బల్క్ డ్రగ్స్ (ముడి పదార్థాలు)లో మూ డొంతులు విదేశాల నుంచే దిగుమతి అవుతాయి. దీంతో కంపెనీలపై మోయలేని భారం పడుతున్నది. పరిశ్రమలు ఇంతగా సతమతమవుతు న్నా కరెన్సీ విలువను స్థిరీకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నది.
రూపాయి పతనంతో 7.5 వేల కోట్ల నష్టం
మనదేశ ఫార్మాకు అత్యంత కీలకమైన యా క్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రిడియంట్స్ (ఏపీఐ)కు దిగుమతులే ఆధారం. ఈ ఏడాది రూ.73,350 (9 బిలియన్ డాలర్లు) కోట్ల విలువైన బల్క్ డ్రగ్స్ మనదేశం దిగుమతి చేసుకొన్నది. నిజానికి గత ఏడాది సెప్టెంబర్లో డాలర్తో రూపాయి విలువ రూ.73 మాత్రమే. ఈ లెక్కన బల్క్ డ్రగ్స్ దిగుమతుల విలువ రూ. 65,700 కోట్లే అవుతుంది. గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఒక డాలర్కు ఇ ప్పుడు రూ.8.58 అధికంగా చెల్లిస్తు న్నాం. అంటే రుడు రూ.73 కు దిగుమతి చేసుకొన్న వస్తువుకు ఈ ఏడాది అదనంగా రూ.8.58 చెల్లిస్తున్నాం.
ఈ లెక్కన రూపాయి పతనంతో ఒక్క ఫార్మా పరిశ్రమపైనే ఏడాదిలో రూ.7,650 కోట్ల భా రం పడింది. దీంతో ఫార్మా కంపెనీలు ఔషధాల ధరలు పెంచి ఆ భారాన్ని వినియోగదారుడిపై మోపటంతప్ప మరో మార్గం లేకుండా పోతున్నది. ‘డాలర్ విలువ బలపడటం దిగుమతులపై ఒత్తిడి పెం చుతున్నది. ఔషధాల ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతున్నది’ అని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రవి ఉదయభాస్కర్ తెలిపారు. రూపాయి పతనం ప్రభావం ఫార్మా ఎగుమతులపై పడింది.
2020-21 ఆర్థిక సం వత్సరంలో మన ఫార్మా ఎగుమతులు 20.7 బిలియన్ డాలర్ల నుంచి 24.2 బిలియన్ డాలర్లకు (రూ.1.97 లక్షల కోట్లు) చేరింది. కానీ, 2021-22లో ఒకశాతంకంటే తక్కువ వృద్ధితో రూ.24.6 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. 2021-22లో మనదేశ బల్క్ డ్రగ్స్ ఎగుమతుల విలువ రూ.33,320 కోట్లు మాత్రమే. డాలర్ విలువ బలపడటంతో చాలాదేశాలు దిగుమతులు తగ్గించి దేశీయంగానే ముడిసరుకులు తయారు చేస్తుండటంతో మన ఎగుమతుల్లో పెరుగుదల మందగించిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పథకం కింద కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ అది అంతంత మాత్రంగానే ఉన్నది.
కేంద్రం వివక్షతో మరింత నష్టం
ఫార్మా పరిశ్రమ మొత్తం కేంద్రీకృతమై ఉన్న హైదరాబాద్లో ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని నిర్మిస్తున్నది. మనదేశంలో ఫార్మారంగాన్ని ఇంత భారీ స్థాయిలో విస్తరిస్తున్నది తెలంగాణలో మాత్రమే. కాగా, బల్క్ డ్రగ్స్ దిగుమతులను తగ్గించి, దేశీయంగానే సమృద్ధిగా ఉత్పత్తి చేయాలని కేంద్రం ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకొన్నది. మనదేశానికి 60 శాతం బల్క్డ్రగ్స్ సరఫరా చేస్తున్న చైనా, ఈ స్థాయికి చేరుకోవటానికి 30 ఏండ్లు పట్టింది.
మనం కూడా ఆ స్థాయికి చేరాలంటే కనీసం 15 ఏండ్లు పడుతుందని కేంద్రంలోని ఓ అధికారి తెలిపారు. ఈ లక్ష్యాన్ని మరింత త్వరగా సాధించాలంటే పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమైన చోట బల్క్డ్రగ్స్ ఉత్పత్తిని ప్రోత్సహించాలి. కానీ, తెలంగాణపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారు అందుకు వ్యతిరేక దిశలో పయనిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలోని ఫార్మాస్యూటికల్ విభాగం హిమాచల్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో బల్క్డ్రగ్స్ పార్కులను ఏర్పాటుచేయాలని ఈ నెలలో సూత్రప్రాయంగా నిర్ణయించింది. పరిశ్రమ కేంద్రీకృతమైన హైదరాబాద్ను మాత్రం పట్టించుకోలేదు.