మన్సూరాబాద్, ఆగస్టు 17: కరోనా కారణంగా వెనుక పడిపోయిన అభివృద్ధి పనులను త్వరలో పరుగులు పెట్టించి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి ఫతుల్లాగూడ సర్వేనెం. 58, హనుమాన్నగర్, శ్రీనివాసకాలనీ, బండ్లగూడ రామాలయం వద్ద రూ. 97.90 లక్షలతో నూతనంగా చేపట్టనున్న యూజీడీ పైపులైన్ పనులకు స్థానిక కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా మన్సూరాబాద్ డివిజన్ పరిధి జడ్జెస్కాలనీ ఫేజ్-1లో రూ. 12.60 లక్షలతో ఏర్పాటు చేయనున్న మంచినీటి పైపులైన్ ఏర్పాటు పనులకు స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సరానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా పది శాతం పనులు చేయలేకపోయామని తెలిపారు.
రెండు సంవత్సరాలుగా ఆగిపోయిన పనులన్నింటినీ ప్రణాళికాబద్దంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శైలజాపురికాలనీ నుంచి ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ ట్రంకులైన్ పనులకు త్వరలో పూర్తి చేసేందుకు మరిన్ని నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, జడ్జెస్కాలనీ ఫేజ్-1 అధ్యక్షుడు అంజయ్యగౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్, శ్రీశైలం, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి గౌడ్, కోశాధికారులు రంగారెడ్డి, సిల్వేరు గాలయ్య, సభ్యులు నరేష్, కిషన్గౌడ్, వివిధ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు సతీష్యాదవ్, నాగరాజు, నాయకులు చెరుకు ప్రశాంత్గౌడ్, అనంతుల రాజిరెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.