శేరిలింగంపల్లి, ఆక్టోబర్ 2: గాంధీ జయంతిని పురస్కరించుకొని బొటానికల్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘రన్ ఫర్ పీస్’కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 10కే, 5కే, 3కే విభాగాల్లో నిర్వహించిన ఈ రన్ను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడుతూ.. బొటానికల్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.
బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్తో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి వారి అభివృద్ధి నిధుల నుంచి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.40 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.