సజ్జనార్
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సులు ప్రజలందరి సంపదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటిని ధ్వంసం చేయవద్దని ఆందోళనకారులకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్ పెట్టారు. ‘ఆర్టీసీ బస్సులు మనం కట్టిన పన్నులతో కొన్నవే. అంటే అవి మన ఆస్తులే. వాటిని తగలబెట్టుకోవడం తప్పు’ అని సజ్జనార్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.