డిచ్పల్లి : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కను నాటారు. సోమవారం ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్టీసీ భవన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్కుమార్ రాష్ట్ర, దేశవ్యాప్తంగా కోట్ల మొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు. పల్లెల్లో పచ్చదనాన్ని నింపేందుకు ఇంటింటికి ప్రతిఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తే కలుషితం లేని స్వచ్ఛమైన గాలి ప్రజలకు లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బస్ భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామ్మోహన్రావు, చీఫ్ ఇంజినీర్ రాంప్రసాద్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.