హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): బస్సు కోసం గంటల తరబడి ఎదురిచూసే పని లేకుం డా ఆర్టీసీ బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ట్రాకింగ్ యాప్ ద్వారా బస్సు ఎక్కడున్నది? ఎప్పుడు వస్తుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ‘టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్’ పేరుతో గూగు ల్ ప్లేస్టోర్లో మొబైల్ యాప్ను సంస్థ వైస్ చైర్మన్, ఎండీ వీసీ సజ్జనార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ యాప్ ప్రయాణికులు బస్ స్టాప్లు/బస్స్టేషన్లలో నిరీక్షించే సమయాన్ని నివారించడానికి, వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి దోహ దపడుతుందన్నారు.
ప్రయోగాత్మకంగా 140 బస్సులను గుర్తించామని, వీటిలో కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులు, శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర సుదూర ప్రాం తాలకు నడుపుతున్న మియాపూర్-1 డిపోకు చెందిన 100 బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం రూట్లలో నడుస్తున్న పికెట్ డిపో బస్సుల్లో ఇప్పటికే ట్రాకింగ్ నడుస్తున్నదని, మరో రెండు నెలల్లో జిల్లాలతోపాటు హైదరాబాద్లో అన్ని రిజర్వేషన్ సేవలు, ప్రత్యేక తరహా సేవలను యాప్లో చేరుస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 96 డిపోలు, 4,170 బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ సిటీ, మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్తోపాటు డిస్ట్రిక్ట్ సర్వీస్లకు వేర్వేరుగా ట్రాక్ చేయవచ్చని వివరించారు. విమానాశ్రయానికి 24/7 నడిచే ఎలక్ట్రిక్ బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థ ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. గరుడ ప్లస్, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసుల సమాచారాన్ని సైతం ట్రాక్ చేయొచ్చని చెప్పారు. గూగుల్ ప్లేస్టోర్ లేదా www.tsrtc. telangana.gov.inలో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.