ఖమ్మం: జిల్లాలోని తల్లాడ మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని అంబేద్కర్నగర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బస్సు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.