తష్కెంట్ : ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్లో సెంట్రల్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్ జరుగుతున్నది. ఆ సమావేశాల్లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్కు చెందిన ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రతినిధి .. ఇమ్రాన్ ఖాన్ను ఓ ప్రశ్న వేశారు. చర్చలు, ఉగ్రవాదం ఒకే రేఖపై నడుస్తాయా అని జర్నలిస్టు ప్రశ్నించారు. ఇది భారత్ వైపు నుంచి వేస్తున్న ప్రశ్న అని ఆ రిపోర్టర్ అడిగారు. దానికి ఇమ్రాన్ బదులిచ్చారు. చర్చల కోసం భారత్ వైపు నుంచి సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నామని, నాగరికులుగా వ్యవహరించాలని ఆ దేశాన్ని కోరామన్నారు. కానీ ఏం చేద్ధాం.. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అడ్డువచ్చినట్లు ఇమ్రాన్ ఆరోపించారు. ఇక తాలిబన్లపై పట్టులేదని మీపై ఆరోపణలు వస్తున్నట్లు వేసిన ప్రశ్నకు ఇమ్రాన్ బదులివ్వలేదు.