న్యూఢిల్లీ: వినాయక ఉత్సవాల నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాలను, దుర్గ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహాలను యుమునా నదిలోగానీ, ఢిల్లీలోని ఇతర నీటి వనరుల్లోగానీ నిమజ్జనం చేయరాదని పేర్కొంది. అందరూ ఈ ఆదేశాలను పాటించేలా అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లు బాధ్యత తీసుకోవాలని సూచించింది.
ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి రూ.50 వేల జరిమానా లేదంటే ఆరేండ్ల జైలుశిక్ష పడుతుందని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ సోమవారం జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. వినాయక నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా కృత్రిమ కొలనులను ఏర్పాటు చేయాలని పట్టణ స్థానిక సంస్థలను ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలను నగరంలోకి తీసుకురాకుండా ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నది.