తిరుమల : టీటీడీకి చెందిన వివిధ ట్రస్ట్లకు పలు సంస్థలు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఆదివారం ఉదయం టీటీడీ అధికారుల సమక్షంలో తమ విరాళాల డీడీలను అందించారు. వీరికి ఆలయ పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
హైదరాబాదుకు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్స్ సంస్థ యాజమాన్యం వెంకటేశ్వర్లు ప్రసాదరావు, రాజమౌళి.. ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు అందించారు.
అలాగే, హైదరాబాదుకు చెందిన హానర్ హోమ్స్ సంస్థ యాజమాన్యం బాలచంద్ర, స్వప్న కుమార్.. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు సంబంధిత డీడీలను అందజేశారు.