ముంబై : రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న నిర్ణయం రైల్వేలకు నష్టం తీసుకొచ్చింది. ప్లాట్ఫాం టికెట్ల రేట్లను అమాంతం పెంచడం వల్ల రైల్వే శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే ఆదాయం రూ.10 కోట్లు మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ప్లాట్ఫాం టికెట్ల ద్వారా రూ.160 కోట్లు సంపాదించింది.
సమాచార హక్కు (ఆర్టీఐ) కింద ఒక కార్యకర్త అడిగిన మేరకు ఈ సమాచారం రైల్వే శాఖ ఇచ్చింది. ప్లాట్ఫాం టికెట్ల అమ్మకాలను నిలిపివేయడం వల్ల ఆదాయంలో 94 శాతం కోల్పోయిందని తెలిపింది. కరోనా కారణంగా రైల్వే స్టేషన్ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా నిలువరించేందుకు ప్లాట్ఫాం టికెట్ను మొదట రూ.50 గా నిర్ణయించారు. అనంతరం దాన్ని కూడా నిలిపివేశారు. 2020-21లో ప్లాట్ఫాం టికెట్ల ద్వారా కేవలం రూ.10 కోట్లు మాత్రమే సంపాదించినట్లు రైల్వే తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ప్లాట్ఫాం టికెట్ల ద్వారా రూ.160.87 కోట్లు సంపాదించింది. ఈ సంపాదన గత 5 సంవత్సరాలలో ఈ విభాగంలో అత్యధికం.
కొన్ని డివిజన్ల పరిధిలో ప్లాట్ఫాం టికెట్ ధరలు పెంచగా.. మరికొన్ని డివిజన్లలో ప్రవేశాలను పూర్తిగా నిషేధించారు. ప్లాట్ఫాం టికెట్ను ఇంతకు ముందు రూ.10 నుంచి 30 కి ధర నిర్ణయించారు. అయినప్పటికీ జనం ఆగకపోవడంతో దానిని రూ.50 కి పెంచారు. కొవిడ్ అదుపులోకి వచ్చిన తర్వాత పాత ధరలను అమలుచేస్తామని రైల్వే చెప్తున్నది.
రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి : నేషనల్ కాన్ఫరెన్స్
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
ప్రోటీన్ వనరు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్తమం
బహు భార్యత్వానికి మద్దతు.. లా ప్రొఫెసర్కు ఇక్కట్లు
ఆంక్షల పొడగింపు : బ్రిటన్ను భయపెడుతున్న డెల్టా వేరియంట్
గెలుపు కోసం : యూపీలో త్వరలో క్యాబినెట్ విస్తరణ..?
ఏడాది ఆలస్యం : అక్టోబర్ 1 నుంచి దుబాయ్ ఎక్స్పో 2020
చరిత్రలో ఈరోజు : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..