రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సకల జనుల ఆమోదం లభించింది. ఈ సారి బడ్జెట్లో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పించింది. ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లాలో విస్తారంగా ఆయిల్ పాం తోటలు సాగవుతున్నాయి. రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించారు. దీంతో అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, పినపాక, ఖమ్మం, కొత్తగూడెం తదితర నియోజకవర్గాల్లో ఆయిల్ పాం తోటల విస్తరణకు అవకాశం ఏర్పడింది. దళితబంధు పథకంలో భాగంగా చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ పథకానికి భారీగా నిధులు విడుదల చేయడంతో 4,500 దళిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సొంత స్థలాలు ఉన్నవారు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో వేలాదిమందికి లబ్ధి చేకూరనున్నది. గౌడ కులస్తుల సంక్షేమానికి రూ.100 కోట్లు, రక్తహీనత ఎదుర్కొంటున్న బాలింతలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సరికొత్త పథకం ప్రవేశపెట్టింది. దీంతో సబ్బండవర్గాలు సంబురాలు చేసుకుం టున్నాయి. ఇది జనరంజక బడ్జెట్ అని అభివర్ణిస్తున్నాయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నాయి.
– ఖమ్మం, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర బెడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బడ్జెట్ కేటాయింపులను వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన బడ్జెట్పై సబ్బండ వర్గాలు హర్షిస్తున్నాయి. ఇది ప్రజారంజకమైన బడ్జెట్ అని కితాబునిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.ఆయిల్ పాం సాగు
ఉమ్మడి జిల్లాలో విస్తారంగా ఆయిల్ పాం తోటలు సాగవుతున్నాయి. రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ బడ్జెట్లో ఏకంగా రూ.1000 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, పినపాక, ఖమ్మం, కొత్తగూడెం తదితర నియోజకవర్గాల్లో ఆయిల్ పాం తోటల విస్తరణకు అవకాశం ఏర్పడింది. ఇప్పటికే శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య చొరవ తీసుకుని వేంసూరులో తోటల విస్తరణకు సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి నిరంజన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రి ఆయిల్ పాం మొక్కలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలను ఎంపిక చేసిన సంగతి విదితమే. దీనిలో ఒకటి చింతకాని మండలం. రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు విడుదల చేయడంతో 4,500 దళిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చొప్పున నిధులు అందనున్నాయి. మరోవైపు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయా వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ నిధులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక గిరిజన తండాలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి రానున్నది.
సొంత స్థలాలు ఉన్న వారు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో వేలాదిమందికి లబ్ధి చేకూరనుంది. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 7-12 తరగతి విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు అందజేయనున్నది. గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో వారి నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. రక్తహీనత ఎదుర్కొంటున్న బాలింతలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. రానున్న రెండేళ్లలో అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షణీయం. కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్న ఎనిమిది జిల్లాల్లో ఖమ్మం జిల్లా ఒకటి కావడం ఆనందాన్నిచ్చింది. ఆర్టీసీ బలోపేతానికి రూ.1,500 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ఇచ్చిన మాట ప్రకారం దళితబంధు పథకానికి భారీగా నిధులు కేటాయించారు. అన్నిరంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు బడ్జెట్కు రూపకల్పన చేయడం అభినందనీయం. క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం రూ.2,56, 958.51 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించడం ఒక్క కేసీఆర్కే సాధ్యమైంది. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం ప్రవేశపెట్టారు. అందుకు అనుగుణంగా రూ.12 వేల కోట్ల నిధులు కేటాయించారు.
– పువ్వాడ అజయ్కుమార్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి
రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ చరిత్రలోనే కొత్త అధ్యాయం. ఇది ప్రజారంజక బడ్జెట్. ఖమ్మానికి మెడికల్ కాలేజీ కేటాయింపు హర్షణీయం. అన్నదాతల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. రూ.50 వేల లోపు రుణం ఉన్న రైతులకు ఈ ఏడాది రుణమాఫీ ప్రకటన శుభవార్త. బడ్జెట్లో అన్నివర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆసరా పింఛన్లకు నిధులు, సొంత స్థలం ఉన్నవారు ఇండ్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తుంది. భారీగా నిధుల కేటాయింపుతో పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి. మహిళలకు వడ్డీలేని రుణాలు, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న అభిమానానికి ప్రతీక.
– టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు
ఇంటికి దూరంగా ఉంటున్న మాకు ఉచితంగా హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు ఇస్తామని ప్రకటించడం హర్షణీయం. కిట్లతో మాకు ఆర్థిక భారం తప్పుతుంది. రాష్ట్ర బడ్జెట్లో విద్యార్థినుల గురించి ప్రస్తావించడం, సమస్యకు పరిష్కారం చూప డం ఆనందాన్నిచ్చింది. విద్యార్థినుల అందరి తరఫున సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– డి.సారిక, పదోతరగతి, కేజీబీవీ, ఖమ్మం రూరల్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాది రూ.75 వేల లోపు రుణమాఫీ, రూ.50 వేలలోపు రుణ మాఫీ మార్చిలోగా చేయనున్నట్లు ప్రకటించింది.
కొత్తగా ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల కోసం భారీగా నిధులు కేటాయించింది. సడలించిన వయోపరిమితి ప్రకారం లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందనుండడంతో వారు సంబురపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో ఆయిల్ పాం విస్తరణ, సాగుకు ఏకంగా రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించడం ఆయిల్పాం రైతులకు వరం. తోటలు చేస్తున్న రైతులకు ఇది శుభవార్త. చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ ఆయిల్ పాం తోటలపై దృష్టి సారించలేదు. బడ్జెట్ నిధులతో రైతులకు మరింత భరోసా లభించింది. రాష్ట్ర బడ్జెట్ ఇతర రాష్ర్టాలకూ ఆదర్శంగా నిలుస్తుంది. ప్రగతి కళ్లకు కట్టినట్లు బడ్జెట్ కనిపిస్తున్నది.
– మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే
రాష్ట బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించడం హర్షణీయం. గీత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారికి ప్రయోజనం. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గౌడ కులస్తుల సంక్షేమానికి తోడ్పడ్డారు. కల్లు కంపౌండ్లను తిరిగి తెరిపించడంతో ఎంతోమందికి ఉపాధి దొరికింది. సీఎం కేసీఆర్ గీత వృత్తిపై పన్ను రద్దు చేసి మేలు చేశారు. వైన్స్ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్ కల్పించారు. హరితహారంలో భాగంగా విరివిగా తాటి, ఈత మొక్కలు నాటించారు. గీత కార్మికులకు పింఛన్ అందజేస్తున్నారు.
– అమరగాని వెంకటేశ్వర్లు గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
బడ్జెట్లో గొర్రెల పెంపకందారుల కోసం రూ.100 కోట్లు కేటాయించడం ఆనందాన్నిచ్చింది. దీంతో మలి విడత రాయితీ గొర్రెల పంపిణీకి మార్గం సుగమమైంది. జిల్లావ్యాప్తంగా సుమారు 16 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి రాష్టంలో ఉనికి కోల్పోయిన గొర్రెల పెంపకందారులకు స్వరాష్ట్రం వచ్చిన సరైన గుర్తింపు లభించింది. వారికి సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తీసుకొచ్చారు. గొర్రెల పెంపకందారులకు జీవనోపాధులు వచ్చాయి.
– మేకల మిల్లిబాబు యాదవ్, ఉమ్మడి జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ఉంది. ప్రభుత్వం అన్నిరంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం హర్షణీయం. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో మెడికల్ కాలేజీ కల నెరవేరుతుంది. మహిళల అభ్యున్నతికి బడ్జెట్లో నిధులు కేటాయించడం వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనం.
– పునుకొల్లు నీరజ, ఖమ్మం నగర మేయర్
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దళితబంధు పథకానికి బడ్జెట్లో చోటు కల్పించి భారీగా నిధులు కేటాయించడం హర్షణీయం. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్కు రూపకల్పన చేశారు. మనస్సాక్షి కలిగిన వారెవరూ దీనిని వ్యతిరేకించరు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు ధన్యవాదాలు.
– ఆదెర్ల స్రవంతి, కారేపల్లి సర్పంచ్
దేశంలో ఎప్పుడూ లేని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపకరించే బడ్జెట్. సీఎం కేసీఆర్ ముందు చూపుతో బడ్జెట్ రూపొందించారు. మన ఊరు మనబడికి నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో పిల్లల చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది. నిరుపేదలకు పక్కా ఇండ్లు ఖాయం. అన్ని పథకాలకు బడ్జెట్లో చోటు లభించింది.
– వనమా వెంకటేశ్వరరావు,కొత్తగూడెం ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల పద్దు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం ఆలోచించి బడ్జెట్ను రూపొందించారు. అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టనున్నది. ఖమ్మానికి మెడికల్ కళాశాల కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. కళాశాల ఏర్పాటుతో జిల్లాప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి.
– తాతా మధు, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించి సంచలనం సృష్టించారు. దళితబంధు పథకానికి నిధులు కేటాయించి దేశంలోనే ఈ పథకానికి గుర్తింపు తెచ్చారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రకటించారు. సొంత స్థలాల్లో ఇండ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షల చొప్పున అందజేస్తామన్నారు. నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు కేటాయించడంతో ఎక్కువ మందికి మేలు జరుగుతుంది.
– కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
అన్నివర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దళిత బంధు అమలుకు రూ.17,700 కోట్లు కేటాయించడం సంచలనం. ప్రభుత్వం నియోజకవర్గానికి 100 దళిత కుటుంబాల చొప్పున అర్హులను ఎంపిక చేసి యూనిట్ల ఏర్పాటుకు రూ.10 లక్షల చొప్పున అందజేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 11,800 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం విడతల వారీగా రూ.7,289 కోట్లు విడుదల చేయనున్నది. ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన జరుగనున్నది.
– డాక్టర్ తెల్లం వెంకట్రావు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి
ఒక పథకం అమ లు చేయడానికి సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. రాష్ట్ర బడ్జెట్లో ప్రతి పథకానికి నిధులు కేటాయింపులు జరిగాయి. ఇచ్చిన మాట ప్రకారం.. అన్ని పథకాలకు నిధులు కేటాయించారు. పేదలకు జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించడం సంచలనం. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు ఈ ప్రకటన శుభవార్త. మెడికల్ కాలేజీకి నిధులు కేటాయించడం హర్షణీయం.
– కోరం కనకయ్య, భద్రాద్రి జడ్పీ చైర్మన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అమోఘం. స్వరాష్ట్ర సాధనకు ఉద్యమించి అమరులైన వారి ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన దళితుల కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఏకంగా బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించడం హర్షణీయం. దళితుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హారీశ్రావు కృతజ్ఞతలు.
– తిప్పన సిద్ధులు,1969 ఉద్యమ నేత, విశ్రాంత అధ్యాపకుడు
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ.24,254 కోట్లు కేటాయించింది. ఈ ఘనత ఒక్క సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దళితుల అభ్యున్నతికి భారీగా విడుదల చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించారు.
– మానె రామకృష్ణ, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇన్చార్జి
ఆయిల్ పాం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. తోటల విస్తరణ, ప్రోత్సాహకాలకు రూ.1000 కోట్ల నిధులను కేటాయించింది. ఇప్పటికే తెలంగాణ ఆయిల్ పాం హబ్గా మారింది. ఆయిల్ పాం విస్తరణ పూర్తిగా జరిగితే ఇక తిరుగే లేదు. ప్రభుత్వం నర్సరీలు ఏర్పాటు చేసింది. సబ్సిడీపై మొక్కలు, ఎరువులు, డ్రిప్ సామగ్రి అందజేస్తున్నది. భవిష్యత్తులో కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ర్టాల్లో పండించే వక్క, తేయాకు సాగు తరహాలో తెలంగాణలో ఆయిల్ పాం తోటలు విస్తరిస్తాయి.
– మద్దినేని వెంకట్, ఆయిల్ పాం రైతు, దమ్మపేట
ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7 నుంచి ఇంటర్మీడియట్ వరకు చ దువుతున్న విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడం హర్షణీయం. నిరుపేదలకు ఈ కిట్లు ఎంతో ఉపకరిస్తాయి. విద్యార్థినుల ప్రాథమిక అవసరాలను గుర్తించి వాటిని అందజేస్తుండడం భే ష్. అలాగే షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో విద్యార్థినులు,మహిళలకు భరోసా వచ్చింది. – కె.విజయలక్ష్మి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల
సంఘం (మహిళా) రాష్ట్ర కార్యదర్శి
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటున్నది. కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నది. నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో అనేక మంది కార్మికులు గాయాల పాలయ్యారు. వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం, సంక్షేమం కోసం సర్కార్ పథకాలు అమలుచేస్తున్నది.
– చింతల వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ కార్మికుడు, ఖమ్మం
తెలంగాణలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. కార్మికుల జీవితాలకు భరోసా కల్పించే విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి కార్మికుల పక్షపాతిగా వారి సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నారు.
– ఎస్కే చాంద్పాషా, ఎలక్ట్రీషియన్, బూడిదంపాడు
రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకమైనది. అన్నివర్గాల సంక్షేమానికి బడ్జెట్ ఉపకరిస్తుంది.రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్రావు అందరూ హర్షించే విధంగా బడ్జెట్కు రూపకల్పన చేశారు.
– అజ్మీరా వీరన్న, టీఆర్ఎస్ మండల ప్రధాన
కార్యదర్శి, కారేపల్లి
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్బండ వర్గాలు హ ర్షించే విధంగా ఉంది. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్కు రూపకల్పన జరిగింది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రానున్న రోజుల్లో మరింత ప్రయోజనం చేకూరే విధంగా బడ్జెట్ ఉంది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న