తిరుమల, జూన్18: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని పరమేషు బయోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేంద్రరెడ్డి శుక్రవారం టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.