రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో బెంగళూరు జట్టుకు గట్టి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాదిన కోహ్లీ (7) తర్వాతి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లీ విఫలమయ్యాడు.
దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వైపు వెళ్లింది. దాన్ని శాంసన్ సులభంగా అందుకోవడంతో కోహ్లీ నిరాశగా మైదానం వీడాడు. దీంతో 9 పరుగుల వద్ద బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది.