కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించొద్దని ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు అలాంటి పనులు చేసి ప్రమాదాలకు గురవుతూనే ఉంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్లోని బంకురా స్టేషన్లో ఇలాంటి ఘటనే జరిగింది. తల్లీకొడుకులు ఇద్దరు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె కాలు జారి కింద పడిపోయింది. ఆ వెనుకే వస్తున్న కుమారుడు కూడా పడిపోయాడు.
వీళ్లిద్దరినీ కొంత దూరం నుంచి గమనిస్తూ ఉన్న ఒక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారిణి.. వాళ్లు పడిపోవడం చూడగానే పరుగు పరుగున వెళ్లి, వారిని కాపాడింది. పక్కన ఉన్న మిగతా ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను రైల్వే శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు సదరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిణిని మెచ్చుకున్నారు. రైలు ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని మరికొందరు హితవులు చెప్పారు.
Service & Seva Bhav!
The alertness & swift action taken by RPF staff at Bankura Station, West Bengal saved the lives of an elderly woman & her son who slipped while boarding the moving train.
Passengers are requested not to board or alight a moving train. pic.twitter.com/Dl0WoTBwvP
— Ministry of Railways (@RailMinIndia) August 8, 2022