సిడ్నీ: టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్తో జరగాల్సిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. గ్రూప్ 2లో తొలి మ్యాచ్లో పాకిస్థాన్పై నెగ్గి దూకుడు మీదున్న భారత్ ఇవాళ నెదర్లాండ్స్ను ఢీకొట్టనున్నది. పాక్తో ఆడిన జట్టుతోనే రోహిత్ సేన ఈ మ్యాచ్లోనూ రంగంలోకి దిగనున్నది. జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. నెదర్లాండ్స్ కూడా ఎటువంటి మార్పులు చేయకుండానే ఇండియాతో మ్యాచ్కు సిద్దమైంది. ఇండియా టైమ్ ప్రకారం మధ్యాహ్నం 12.39 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభంకానున్నది.
🚨 Toss & Team News 🚨@ImRo45 has won the toss & #TeamIndia have elected to bat against Netherlands.
Follow the match 👉 https://t.co/Zmq1aoK16Q #T20WorldCup | #INDvNED
A look at our Playing XI 🔽 pic.twitter.com/mZZfXwg67d
— BCCI (@BCCI) October 27, 2022