మెల్బోర్న్: వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరిగే ఆసియాకప్కు ఇండియా వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను రిపోర్టర్లు ప్రశ్న వేశారు. ఆ సమయంలో రోహిత్ స్పందిస్తూ.. ప్రస్తుతం తాము టీ20 వరల్డ్కప్పై దృష్టి పెట్టామని, ఎందుకంటే ఇప్పుడు అదే ముఖ్యమని, తర్వాత ఏం జరుగుతుందన్న దానిపై ఆందోళన లేదని, బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకుంటుందని, రేపు పాకిస్థాన్తో జరిగే మ్యాచ్పైనే తాము ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు.
మెల్బోర్న్ స్టేడియంలో ఆదివారం పాకిస్థాన్, ఇండియా మధ్య సూపర్ 12 మ్యాచ్ జరగనున్నది. పాకిస్థాన్ బౌలింగ్ ఎంత బలంగా ఉందో తమకు తెలుసు అని, ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కూడా అనుభవంతో ఉందని రోహిత్ అన్నాడు. రెండు బలమైన జట్లు ఎదుర్కొన్నప్పుడు ఆ పోటీ ఆసక్తికరంగా ఉంటుందని రోహిత్ తెలిపాడు. పాక్ బౌలింగ్ తమకు సవాల్గా మారుతుందని తెలుసన్నాడు. కానీ తమ బ్యాటర్లు రెఢీగా ఉన్నట్లు కూడా రోహిత్ చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ గురించి డిస్కస్ చేశామన్నాడు.