మెల్బోర్న్: ఐసీసీ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడో పోస్టు వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. టీ20 వరల్డ్కప్ సందర్భంగా ఇవాళ కెప్టెన్స్ డే ఈవెంట్ను ఆర్గనైజ్ చేశారు. మొత్తం 16 జట్ల కెప్టెన్లతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఆ సమయంలో ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆ ఫోటో సెషన్లో పాల్గొన్నారు. బాబర్, రోహిత్ ఫోటోలతో ఐసీసీ తన ఇన్స్టాలో ఓ రీల్ను పోస్టు చేసింది. ఆ రీల్కు బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా ప్రజెంట్ చేసింది. ఏంటీ, మనం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామా అని బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది. ఐసీసీ షేర్ చేసిన ఆ పోస్టుకు తెగ కామెంట్లు వస్తున్నాయి.