Rohit on Virat Kohli | మాజీ సారధి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మీడియా ప్రశ్నలపై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. కోహ్లీ ఫామ్ గురించి ప్రశ్నలు అడగడం ఆపేయండన్నాడు. విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. బుధవారం నుంచి వెస్టిండీస్తో టీ-20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కోహ్లీకి దన్నుగా నిలిచాడు. ఇటీవల వెస్టిండీస్తో ముగిసిన మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఫామ్ గురించి మీడియా ప్రశ్నలు సంధించింది. కోహ్లీ ఫామ్ గురించి మీడియాలోనే వార్తలొస్తున్నాయన్నాడు రోహిత్. ఒకవేళ కొంతకాలం మీడియా మౌనంగా ఉంటే అంతా బాగుంటుందన్నాడు.
వెస్టిండీస్తో బుధవారం టీ-20 సిరీస్ ప్రారంభం అవుతున్నది. ఈ నేపథ్యంలో టీం ఇండియా సారధి రోహిత్శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లు వేలంపై చర్చ పక్కనబెట్టి వచ్చే రెండు వారాలు వెస్టిండీస్ టీ-20 సిరీస్పై దృష్టి సారించాలని సూచించాడు. బుధవారం వెస్టిండీస్తో టీం ఇండియా తొలి టీ-20 మ్యాచ్ ఆడుతుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్-2022 సీజన్ వచ్చేనెల 27 నుంచి ప్రారంభించాలని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. భారత సంతతికి చెందిన తన గర్ల్ఫ్రెండ్ విని రామన్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. 2017 నుంచి వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. 2020 ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. వచ్చేనెల 27న మెల్బోర్న్లో తమిళ సంప్రదాయ పద్దతిలో పెండ్లి జరుగనున్నది. 2022 ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) తరఫున ఆడనున్నాడు. ఆయన్ను ఆర్సీబీ రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది.