బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక కొందరి తలరాతలు మారిపోయాయి. కార్లు, ఖరీదైన బంగ్లాలు కొంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేం రోహిణి ఏకంగా హైదరాబాద్లోని మణికొండలో డూప్లెక్స్ హౌస్ను కొనుగోలు చేసింది. ఎట్టకేలకు తన సొంతింటి కల నెరవేరిందని తెలియజేస్తూ హోమ్ టూర్ వీడియోను యూట్యూబ్లో షేర్ చేసింది
ఈ వీడియోలో తన ఇంటిని అంతా చూపిస్తూ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చింది. హాల్, కిచెన్, బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, సిట్టింగ్ ఏరియా, టెర్రస్ను అంతా చూపిస్తూ సందడి చేసింది. ఈ ఇంటిని ఫర్నీచర్తో సహా కొన్నానని, త్వరలోనే దీన్ని తనకు నచ్చినట్లు మరింత అందంగా మార్చేస్తానంది. ఇక టెర్రస్పై మొక్కలు కూడా పెంచుతానని పేర్కొంది.
సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చిన రోహిణి ఆ ఇంట్లోకి తన తల్లిని తీసుకెళ్లి చూపించింది. అమ్మ కళ్లలో ఆనందం చూసి తాను ఎమోషనల్ అయింది. మొదట్లో పలు సీరియల్స్ లో నటించిన రోహిణి.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింత పరిచయాన్ని పెంచుకుంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన పాత్రలతో బాగా ఆకట్టుకుంటుంది.