శాలిగౌరారం, అక్టోబర్ 4: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లో చొరబడి, డమ్మీ తుపాకీతో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు లాక్కెళ్లారు దుండగులు. ఈ ఘటన సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురంలో జరిగింది. సోమవారం గ్రామస్థులు సద్దుల బతుకమ్మ ఆడుకుంటుండగా, ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్పై వచ్చారు. ఇండ్లల్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న ఎర్ర జానమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో చొరబడ్డారు.
అప్పటికే బతుకమ్మ ఆడి ఇంటికి రాగానే, ఇంటి తలుపులు తెరిచి కనిపించాయి. వెంటనే లోపలికి వెళ్లి చూడగా, దొంగలు కన్పించారు. దొంగలు డమ్మీ తుపాకీ చూపించి జానమ్మ మెడలో ఉన్న పుస్తెల తాడు, చెవి కమ్మలు లాక్కెళ్లారు. తుపాకీని అక్కడే వదిలి వెళ్లారు. రూ.50 వేల నగదుతోపాటు 3 తులాల చంద్రహారం, 20 తులాల వెండి మొలతాడు కూడా తీసుకెళ్లినట్టు బాధితురాలు తెలిపింది. జానమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ రాఘవరావు మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.