పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం గుంజపడుగులోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో దుండగులు చోరీకి తెగబడ్డారు. బుధవారం రాత్రి బ్యాంక్ వెనక కిటికీ పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు.. లాకర్లోని బంగారం సహా నగదును అపహరించారు. ఇవాళ ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిసరాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.