కామారెడ్డి: జిల్లాలోని బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోకి చొరబడిన దుండగులు హుండీ పగుల గొట్టి నగదు, రూ.లక్ష విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని.. ఆలయాన్ని పరిశీలించారు. ఆధారాలకోసం క్లూస్ టీమ్ను రప్పించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.