చాంద్రాయణగుట్ట, ఆగస్టు 1: నాలుగేండ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపిన ప్రకారం, జహంగీరాబాద్లో నివసించే మహ్మ ద్ తఖీషా ఖాద్రి(23) చోరీలు చేసేవాడు. ఇతనికి గిరిజన మహిళా లక్ష్మి(24)తో పరిచయమై, ఇద్దరు పెండ్లి చేసుకున్నారు. తరువాత లక్ష్మీ పేరును ఆయేషాగా మా ర్చుకున్నారు. తఖీషా ఖాద్రికి మహ్మద్ హసన్(22) స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరు కలిసి చోరీలకు పాల్పడేవారు. ఇదిలా ఉండగా, హసన్ 2018లో కుటుంబ స భ్యులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా డు. ఈ క్రమంలో హసన్కు తఖీషా ఖాద్రి తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. అంత సజావుగానే సాగుతుందనే క్రమంలో ఓ చోరీ సొత్తు పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తఖీషా ఖాద్రి మ రోసారి నా ఇంటికి రావొద్దని హెచ్చరించి హసన్ని ఇం టి నుంచి బయటకు పంపించాడు. అయినప్పటికీ తరు చూ హసన్ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. 2018 అక్టోబర్ నెలలో తఖీషా ఖాద్రి ఇంటికి హసన్ రావడంతో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. కోపంతో ఉన్న తఖీషా ఖాద్రి కత్తితో హసన్ని పొడిచి చంపాడు. అనంతరం, శరీరాన్ని ముక్కలు చేసి రావిరాల, మామిడిపల్లి రహదారుల్లో పడేశాడు. ఆ తరువాత హత్య జరిగిన ఇంటిని ఖాళీ చేసి జల్పల్లికి మకాం మార్చారు.
నిందితులను పట్టించిన చిచ్చు..
గతంలోనే 2018 అక్టోబర్ నెలలో తన కొడుకు మహ్మద్ హసన్ కనిపించడం లేదని మృతుడి తల్లి చాం ద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా జల్పల్లిలో కాపురం పెట్టిన తరువాత తఖీషా ఖాద్రీ అయేషా ఉండగా, మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. రెండో భార్య మోజులో తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో అయేషా చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించింది. 2018లో తన భర్త తఖీషా ఖాద్రి తను కలి సి హసన్ను ఎలా చంపింది పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు ఖాద్రీతో పాటు హత్యలో భర్తకు సహకరించిన అయేషాను జైలుకు తరలించారు.