భోపాల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి కాలు విరిగింది. అతడిని దవాఖానకు తరలించడానికి స్థానికులు 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ ఎంతకీ రావడం లేదు.. దీంతో బాధితుడిని ఆటోలో హాస్పిటల్కు తీసుకెళ్లాలనుకున్నారు. అయితే ఆటో డ్రైవర్లు నిరాకరించారు. చేసేదేంలేక అతడిని జేసీబీలో (JCB) ఆస్పత్రికి తరలించిన ఘటన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లా బారాహీలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో మహేశ్ బర్మన్ అనే యువకుడి కాలు విరిగింది. స్థానికులు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే స్థానికంగా అంబులెన్స్ అందుబాటులో లేదని, పక్కన ఉన్న మరో ఊరునుంచి పంపిస్తామని చెప్పారు. గంటలు గడుస్తున్నాయి. ఎంతకీ అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులు మూడు నాలుగు ఆటోలను సహాయం అడిగారు. ఎవ్వరూ తమ ఆటోలో అతడిని హాస్పిటల్కు తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో పుష్పేంద్ర విశ్వకర్మ అనే వ్యక్తి తన జేసీబీలో అతడిని ప్రభుత్వ దవాఖానకు తరలించాడు. దీనిని కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్లో వైద్య సౌకర్యాల లేమికి ఇది నిదర్శమని విమర్శలు సంధిస్తున్నారు.
State of health services in MP exposed again. A youth injured in road mishap had to be carried by a JCB machine to hospital for the want of ambulance or any other vehicle in Katni district. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/7zhdm1vYxt
— Anuraag Singh (@anuraag_niebpl) September 13, 2022
కాగా, ఈ ఏడాది ఏప్రిల్లో ఓ సభలో పాల్గొన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 1445 నుంచి 2052కు పెరిగిందని చెప్పారు. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఉన్న అంబులెన్సులు 75 నుంచి 167కు, బేసిక్ లైఫ్ సపోర్ట్ ఉన్నవి 531 నుంచి 835కు పెరిగాయని గొప్పగా ప్రకటించారు. అయితే రోగులు, వ్యాధిగ్రస్తులు, బాధితులకు సరైన సమయంలో అంబులెన్సులు అందుబాటులో లేని ఘటనలు రాష్ట్రంలో పెద్దసంఖ్యలో చోటుచేసుకున్నాయి. గత నెలలో ఓ పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భినిని జేసీబీలో తరలించిన ఘతన నీముచ్లో జరిగింది.
#WATCH | Madhya Pradesh: Accident victim in Katni taken to hospital in a JCB as the ambulance got late in arriving at the accident spot (13.09) pic.twitter.com/f2qcMvUmcV
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 14, 2022