హైదరాబాద్ : సికింద్రాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాతపడ్డాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జనహర్నగర్ పరిధిలోని చెన్నాపూర్లో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇద్దరు యువకులు బైక్పై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో ఇద్దరు యువకులు బండిపై నుంచి కిందపడిపోయారు. అదే మార్గంలో వస్తున్న ఆర్టీసీ బస్సు యువకులపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే యువకున్ని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, యువకులకు సంబంధించి వివరాలు తెలియరాలేదు.