హైదరాబాద్, జూలై: సమగ్రమైన రివర్శ్ లాజిస్టిక్స్ పరిష్కారాలను అందించడంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన, మునిచ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న రివర్శ్ లాజిస్టిక్స్ గ్రూప్ (ఆర్ఎల్జీ)కు అనుబంధ సంస్ధ అయిన ఆర్ఎల్జీ ఇండియా 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం క్లీన్ టు గ్రీన్ (సీ2జీ)కింద క్లీన్ టు గ్రీన్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని పరిచయం చేసినట్లు వెల్లడించింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మార్గనిర్ధేశకత్వంలో, డిజిటల్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా క్లీన్ టు గ్రీన్ ఆన్ వీల్స్ లో భాగంగా తొమ్మిది మినీ వాణిజ్య వాహనాలు (చోటా హాట్టి)లు భారతదేశ వ్యాప్తంగా ఒక లక్ష కిలోమీటర్లకు పైగా తిరుగనున్నాయి. భారతదేశ వ్యాప్తంగా 110 నగరాలు, 300 పట్టణాలను చేరుకోనున్నాయి. ఈ కార్యక్రమ ప్రధానోద్దేశ్యం పాఠశాల విద్యార్థులు, కార్పోరేషన్స్, బల్క్ కన్స్యూమర్, రిటైలర్లు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్డబ్ల్యుఏలు), డీలర్లు, అసంఘటిత రంగం, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలను చేరుకుని ఈ-వ్యర్ధాల ప్రమాదాలు , చేయాల్సిన, చేయకూడని అంశాలను గురించి తెలుపడం.
క్లీన్ టు గ్రీన్ ఆన్ వీల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎస్ పీసీబీ మెంబర్ సెక్రటరీ నీతు కుమారి ప్రసాద్ మాట్లాడుతూ ‘‘సాంకేతికంగా అత్యాధునిక ఆవిష్కరణలు దేశాభివృద్ధి పరంగా నూతన, వినూత్నమైన అవకాశాలను అందించినప్పటికీ, ఆ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పనికిరాకుండా పోయినప్పుడు వాటిని తగిన రీతిలో , అత్యంత జాగ్రత్తగా నాశనం చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. క్లీన్ టు గ్రీన్ ఆన్ వీల్స్ కార్యక్రమం లక్షలాది మంది ప్రజలను చేరుకుంటుంది. అని అన్నారు.