2022-23 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదల
బాసర, జూలై 5 : రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీ(2022-23)లో విద్యాసంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింది. డైరెక్టర్ సతీశ్కుమార్ ఇటీవల విడుదల చేశారు.
ప్రవేశ అర్హతలు..
రిజర్వేషన్లు ఇలా…
ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం. ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులకు ఫ్రీ, సైనిక ఉద్యోగులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం భర్తీ చేయనున్నారు.
ఫీజుల వివరాలు..
రాష్ట్రంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రూ. 36 వేలు చెల్లించాలి. ఫీజ్ రీయంబర్స్మెంట్కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000, ఎస్టీ, ఎస్సీలు రూ. 500 చొప్పున చెల్లించాలి. ఇతర రేషన్, గల్ఫ్దేశాల్లో చదివే అభ్యర్థులు ఏడాదికి రూ. 1.36 లక్షలు, ఎన్ఆర్ఐ విద్యార్థులకు రూ. 3.01 లక్షల ఫీజు చెల్లించాలి.
కౌన్సెలింగ్లో సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఇచ్చిన రసీదు. మార్కుల లిస్టు, నివాస సర్టిఫికెట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్, సైనికోద్యోగుల పిల్లలు అయితే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎస్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే వాటికి సంబంధించిన అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
గ్రేడ్పాయింట్లు సమానమైతే ఇలా..
ట్రిపుల్ఐటీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సంబంధిత కేటగిరీల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు సంబంధిత కేటగిరీల్లో విద్యార్థుల జీపీఏ ఒక్కటయితే వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఎక్కువగా మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే విద్యార్థి పుట్టిన తేదీ ప్రకారం.. ఎవరు పెద్దవారయితే వారికి సీటు కేటాయించనున్నారు. ఇవి కూడా సమానంగా ఉంటే పదోతరగతిలో విద్యార్థి హాల్టికెట్ నంబర్, రాండమ్లో ఎవరికి తక్కువగా ఉంటే వారిని ఎంపిక చేస్తారు.
0.4 జీపీఏ కలిపేది వీరికే..
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు, నాన్రెసిడెన్షియల్ పాఠశాలల, జడ్పీ హైస్కూల్, మున్సిపల్ హైస్కూల్, సాంఘిక సంక్షేమ మోడల్ స్కూల్లో చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏ వెయిటేజీ ఇవ్వనున్నారు. ట్రిపుల్ఐటీలో 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 ఆర్టికల్ డీ సెక్షన్ 95, 2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తుల వెబ్సైట్ : admissions@rgukt.ac.in
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తేది : జూలై 1
దరఖాస్తులకు చివరి తేది : జూలై 15
పీహెచ్/ఎన్సీసీ/స్పోర్ట్స్ విద్యార్థులు హార్డ్కాపీస్ను పంపించే చివరి తేది : జూలై 19
అర్హుల జాబితా విడుదల తేది : జూలై 30