మహదేవపూర్, ఆగస్టు 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్లోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బరాజ్కు వరద నీరు పెరిగింది. శనివారం ఇన్ఫ్లో 1,60,410 క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 3,37,910 క్యూసెక్కులకు పెరిగింది. అంతే మొత్తంలో బరాజ్లోని 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు భారీ నీటిపారుదల శాఖ డీఈ సురేశ్ తెలిపారు.