కరీంనగర్ : కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానాల్లో గణనీయంగా ప్రసవాలు పెరుగుతున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ లోని ప్రభుత్వ దవాఖానలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీస్కాన్ సెంటర్ తోపాటు వార్డును మంత్రి ఫ్రరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీతో నిరుపేదలకు ఏంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు.
ప్రసవాల కోసం ప్రతి నిరుపేద ప్రభుత్వ దవాఖానలపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లతో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగిందని, వీటి సంఖ్య ఇంకా పెంచాలని వైద్యులకు సూచించారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు మందులు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి!
విషాదం : కాన్పుకోసం వచ్చి మహిళ మృతి
తెలంగాణ ఉద్యమంలో ఫొటో గ్రాఫర్స్ పాత్ర మరువలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
యాదాద్రిలో ముగిసిన పవిత్రోత్సవాలు