Rishi Sunak | ప్రధాని పదవికి పోటీ నుంచి తప్పుకోవాలని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన సూచనను తోసి రాజని.. బరిలో నిలుస్తున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ప్రకటించారు. అధికారికంగా ప్రధాని పదవి ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు ట్వీట్ చేశారు. అంతే కాదు అధికార కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా పోటీ పడుతున్నట్లు తెలిపారు.
గొప్పదేశం యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని రిషి సునాక్ చెప్పారు. గతానికంటే మెరుగ్గా భావితరాలకు అవకాశాలు కల్పించే సంగతి తమ పార్టీ ప్రధాని ఎంపిక నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక సమస్యల పరిష్కారంతోపాటు దేశ ప్రజలకు పార్టీ ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడానికి తాను ప్రధాని పదవికి, పార్టీ నాయకత్వ స్థానానికి పోటీలో ఉంటున్నట్లు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం పలు సమస్యలను ఎదుర్కొంటున్నదని రిషి సునాక్ చెప్పారు. సరైన నేతను ఎంచుకుంటే అవకాశాలు కూడా అద్భుతంగా ఉంటాయన్నారు. గత హామీలను నెరవేర్చిన రికార్డు తనకు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, ఇతర సమస్యల పరిష్కారానికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని వెల్లడించారు.
బ్రిటన్లో ప్రధాని పదవి బరిలో నిలిచేందుకు 100 మంది టోరీ పార్టీ ఎంపీల మద్దతు అవసరం. తమ నేతకు 128 మంది ఎంపీల మద్దతు ఉందని రిషి సునాక్ క్యాంప్ ప్రకటించింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 357 మంది ఎంపీలు ఉన్నారు.
మరో మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్ కూడా ప్రధాని ఎన్నిక బరిలో నిలుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అయితే ఆమెకు కేవలం 20 మంది ఎంపీల మద్దతు మాత్రమే లభించిందని సమాచారం. ఇక మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బ్రిటన్ ప్రధాని పదవికి జరిగే ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడనున్నారు.
The United Kingdom is a great country but we face a profound economic crisis.
That’s why I am standing to be Leader of the Conservative Party and your next Prime Minister.
I want to fix our economy, unite our Party and deliver for our country. pic.twitter.com/BppG9CytAK
— Rishi Sunak (@RishiSunak) October 23, 2022