దుబాయ్: టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్పంత్ దూసుకెళ్తున్నాడు. తాజాగా ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో పంత్ ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపరచుకొని కెరీర్ బెస్ట్ ర్యాంకు ఏడులో నిలిచాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో 1000 పరుగులు సాధించిన తొలి ఓపెనర్గా నిలిచిన రోహిత్ శర్మ ఒక స్థానాన్ని అధిరోహించి పంత్, న్యూజిలాండ్ ఓపెనర్ హెన్రీ నికోల్స్తో కలిసి ఏడో స్థానాన్ని పంచుకున్నాడు. 747 రేటింగ్ పాయింట్లతో ఏడో ర్యాంకును ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు దక్కించుకోవడం విశేషం.
టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి ఎగబాకాడు. బుమ్రా ఒక ర్యాంకు కోల్పోయి పదో ర్యాంకుకు పడిపోయాడు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఒక ర్యాంకు కోల్పోయి మూడుకు పడిపోగా..అశ్విన్ ఒక స్థానం మెరుగుపరచుకొని నాలుగో ర్యాంకులో నిలిచాడు.