కోల్కతా : తృణమూల్ కునాల్ ఘోష్ రూ.2.67 కోట్ల శారదా డబ్బును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు తిరిగి ఇచ్చాడు. పోంజీ సంస్థ యొక్క మీడియా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు శారదా గ్రూప్ తనకు చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చినట్లు తెలిసింది.
శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ అంశంపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి కునాల్ ఘోష్ రూ.2.67 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లుగా తెలుస్తున్నది.
కునాల్ ఘోష్ ఈ నెల మొదట్లో ఈడీ ప్రశ్నించింది. శారదా చిట్ఫండ్ నుంచి తీసుకున్న డబ్బులో నుంచి జీతం, ప్రకటనల ఖర్చుల ఆదాయపు పన్నును తగ్గించిన తరువాత మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అనుమతించాలని ఈడీని కునాల్ ఘోష్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఈడీ రెండు రోజుల క్రితం అంగీకరించడంతో ఆ మొత్తాన్ని కునాల్ ఘోష్ జమచేసినట్లుగా తెలుస్తున్నది.
తన బ్యాంక్ ఖాతాలు, ఎల్ఐసీ పాలసీలు, శ్రేయోభిలాషుల నుంచి తీసుకున్న రుణాల నుంచి డబ్బును విత్డ్రా చేసుకుని ఈ మొత్తాన్ని ఏర్పాటు చేసినట్లు కునాల్ ఘోష్ పేర్కొన్నారు.
తన అక్రమ పథకాలలో పెట్టుబడులపై అసాధారణంగా అధిక రాబడిని ఇవ్వనున్నట్లు ప్రకటించి వేలాది మంది డిపాజిటర్లను మోసం చేసినట్లు శారదా గ్రూప్పై ఆరోపణలు ఉన్నాయి.
టీఎంసీ మాజీ ఎంపీ ఒకరు నెలకొల్పిన టీవీ ఛానల్, దినపత్రికకు శారదా గ్రూప్ నిధులు సమకూర్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో ఇప్పటికే కునాల్ ఘోష్ 34 నెలల జైలు జీవితాన్ని అనుభవించారు. ప్రస్తుతం ఈయన పశ్చిమ బెంగాల్ పోలీసులు, సీడీఐ అదుపులో ఉన్నారు. కునాల్ ఘోష్కు 2016 అక్టోబర్ 5 న బెయిల్ వచ్చింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కునాల్ ఘోష్ను 2013 లో టీఎంసీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అనంతరం ఆయనను తిరిగి పార్టీ ప్రతినిధిగా నియమించారు.