అలిగఢ్ : రైలు గేటు వేసి ఉన్నప్పుడు దాని కింది నుంచి వంగి వెళ్తుండటం మనం చూస్తుంటాం. ఇలా వంగి వెళ్తుండగా జరిగిన అనేక ప్రమాదాలను కూడా చూసి ఉంటాం. అయినా మనకు జ్ఞానోదయం కాదు. గేటు వేసి ఉంటేంది అనుకుని దాటేందుకు ప్రయత్నించి ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడగానే.. బ్రతుకు జీవుడా అంటూ నిట్టూరుస్తాం. ఇలాంటిదే అచ్చం అలీగఢ్లో శుక్రవారం జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో రైలు వస్తుందని తెలియడానికి, పట్టాలు దాటి వెళ్లకుండా ఉండేందుకు రైల్వే సిబ్బంది గేటు వేశారు. ఎప్పుడో వచ్చే రైలు కోసం మనం ఆగడమేంటి? అని అనుకుంటూ గేటు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తాం. అచ్చం ఇలాంటి ఆలోచనతోనే ఓ రిక్షా కార్మికుడు పట్టాలు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అంతలోనే రైలు దూసుకువచ్చింది. రిక్షాను తన చక్రాల కింద నుజ్జునుజ్జు చేస్తూ కొద్ది దూరం లాక్కెళ్లింది.
సదరు రిక్షాపుల్లర్ వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రైలు చక్రాల కింద నుజ్జునుజ్జు అయిన తన రిక్షాను చూస్తూ భయంగా లేచి వెళ్లిపోయాడు. రిక్షా పోయినందుకు బాధగా ఉన్నా.. ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం పట్ల లోలోన రిక్షోడు సంతోషంగా ఉన్నాడు. ఈ వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గేటు మూసి ఉన్నప్పటికీ రిక్షా పుల్లర్ రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపిస్తున్నది. మూసి ఉన్న గేటు కింది నుంచి రైల్వే ట్రాక్ను దాటడం ప్రమాదకరమని ఈ వీడియో చెప్తున్నది. అందుకే రైల్వే ట్రాక్ వద్ద గేటు వేయగానే బండి ఇంజిన్ను ఆఫ్ చేసి నిలబడటం అన్నింటా శ్రేయస్కరం.
#WATCH | Narrow escape for a rickshaw puller while crossing a railway track in Uttar Pradesh's Aligarh. (09.09) pic.twitter.com/Tb49XcaXcc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 11, 2022