న్యూఢిల్లీ: కోర్టుల్లో మౌలిక వసతులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వచ్చేనెలలో సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని రాష్ర్టాల న్యాయశాఖ మంత్రులతో ఈ సమీక్ష జరుగనుంది. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక వసతులు సరిగా లేవని, వీటిని మెరుగుపర్చడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని ఇటీవల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి రిజిజు ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సమావేశం సందర్భంగా న్యాయమంత్రుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తారు.