అమరావతి : ఏపీలో ఆర్జీయూకేటీ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాల జాబితాను ఏపీ మంత్రి బొత్స సత్య నారాయణ విజయవాడలో విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు. ట్రిపు ల్ ఐటీకి 70శాతానికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే ఉంటారని వివరించారు. ఏపీలోని కళాశాలల్లో ప్రాంగణ ఎంపికలు పెరిగాయని, ఇన్ఫోసిస్ కూడా తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఇకపై ఫలితాల విడుదల అధికారులే చూసుకోవాలని , విధానపరమైన నిర్ణయాలు ఉంటేనే తనను పిలవాల ని అధికారులను ఆదేశించారు. ఛాన్సలర్ కేసిరెడ్డి మాట్లాడుతూ పదో తరగతి మార్కుల ఆధారంగా కౌన్సిలింగ్ ఫలితాలను వెల్లడించామని, 77 శాతం ప్రభుత్వ బడుల్లో చదివిన వారికే ఆర్జీయూకేటీలో ప్రవేశాలు కల్పిస్తు న్నామని తెలిపారు.
వారసులను రాజకీయాల్లోకి తీసుకురావచ్చు కాని..
‘వారసులు అందరికీ ఉంటారు. నాకు మా అబ్బాయి ఉన్నాడు. రాజకీయాల్లో ఎవరైనా వారసులను దింపొ చ్చు. కాని ప్రజలు ఆమోదించాలి కదా’ ని బొత్స ప్రశ్నించారు. కొంతమంది వైసీపీ నాయకుల వారసులు గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంపై సమీక్షలో నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మద్ధ తుగా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాలు గెలవాలనుకోవడం అత్యాశకాదని తెలి పారు.
ఒక్కస్థానం పోయినా ఫర్వాలేదనుకుంటే 10 అవుతుందని తెలిపారు. వైసీపీ పార్టీకి శాశ్వత అధ్యక్షుడి ఎన్నికపై సుప్రీం తీర్పు ఇచ్చిన సమాచారం తనకు తెలియదని వ్యాఖ్యానించారు. శాఖాపరమైన సమీక్షల మాదిరే పార్టీ పరంగా లోటుపాట్లు ముఖ్యమంత్రి చెప్పారని, ఏ పార్టీకైనా అంతిమ లక్ష్యం గెలుపేనని సీఎం చెప్పారని వెల్లడించారు.