హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని గోల్కొండ కోటలో చేపట్టిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం పరిశీలించారు. అక్కడే పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్&బీ, ఐ&పీఆర్, సాంస్కృతిక, రెవెన్యూ శాఖల అధికారులతో వేడుక ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో వ్యవహారించి స్వాతంత్య్ర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 15 వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు
ఈ కార్యక్రమంలో టీఆర్&బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పి ఆర్. కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అడిషనల్ డీజీపీ (Law & Order) జితేందర్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల CIG శేషాద్రి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ అరవిందర్ సింగ్, ఐ&పీఆర్ విభాగం అదనపు డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఇతర పోలీసు, జీఏడీ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.