హైదరాబాద్: కాప్రా custodian భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం కాప్రా చేరుకున్న రెవెన్యూ అధికారులు.. పోలీసుల భద్రత నడుమ వందల కోట్ల విలువచేసే ఈ ప్రభుత్వ భూముల్లో అక్రమ ఫెన్సింగ్ను తొలగించారు. సర్వే నంబర్ 151, 152లోని 13.17 ఎకరాలు గల కస్టోడియన్ భూముల్లో కబ్జాదారులు ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ను ఆరు జేసీబీల సహాయంతో తొలగించారు. మొత్తం 70 ఎకరాల్లో ప్రభుత్వ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆర్డీవో మల్లయ్య, ఏసీపీ శివకుమార్ పర్యవేక్షించారు.