అమరావతి : సాంకేతిక సమస్యలతో ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సర్వర్లు నిలిచిపోయాయి. రాష్ట్రం లోని సచివాలయాలు, మీసేవా కేంద్రాలల్లో అప్లికేషన్లు వేలల్లో పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కులము, ఆదాయము, ఈసీ, కుటుంబ సభ్యుల, ఇతర సర్టిఫికేట్ల కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు కులము సర్టిఫికెట్ కోసం దరఖాస్తులు చేసుకుని ఎదురుచూపు చూస్తున్నారు.
మార్చి, ఏప్రిల్ నెలలో పెట్టిన సర్టిఫికెట్ నేటికి అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోని అప్లికేషన్ ఆన్లైన్లో కనిపించటం లేదని స్వయాన రెవెన్యూ అధికారులు పేర్కొనడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.